CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామాల్లో క్వారెంటయిన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

Share it:

 



మన్యం టీవీ మంగపేట.


కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను క్వారెంటయిన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఇండ్లలో ఉండటం వల్లన ఇంట్లో ఉన్న మిగిలిన సభ్యులు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లో క్వారెంటాయిన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతీ కేంద్రానికి ఇద్దరు ఆశావర్కర్లను నియమించాలని అన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కింద కరోనా రోగులకు భోజనం అందించే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. 45 సంవత్సరాలు పైబడిన ప్రతీ ఒక్కరికి కరోనా టీకా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: