CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్: ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యూసఫ్ షరీఫ్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

కోవిడ్ సమయంలో దేశంలోనే ప్రప్రథమంగా ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకున్న తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యూసఫ్ షరీఫ్ కొనియాడారు.ప్రైవేట్ టీచింగ్,నాన్ టీచింగ్ ఉపాధ్యాయుల జీవితాల్లో వెలుగులు నింపి చిర స్థాయిగా నిలిచారన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచిందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు.కోవిడ్ ఆపత్కాల సమయంలో ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకునేందుకు కృషి చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,మంత్రులు హరీష్ రావు,కమలాకర్,శ్రీనివాస్ గౌడ్,ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ లకు నియోజకవర్గ ప్రైవేటు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.ప్రతీ ప్రైవేట్ ఉపాధ్యాయులకు నెలకు రెండు వేల నగదుతో పాటు,25 కేజి ల బియ్యం ఇచ్చి ఆదుకోవడం మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,ట్రస్మా యాదగిరి శేఖర్ రావు, శేషుకుమార్ లకు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం జిల్లా అధ్యక్షులు బండి లక్ష్మణ్,కోశాధికారి టి.ప్రసాద్ లు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Share it:

Post A Comment: