మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుభాష్ నగర్ గ్రామము కరెంట్ ఆఫీస్ కి చెందిన ఒక ఆదివాసి కుటుంబంలో జరిగిన ఈ విషాద ఘటన,, 9 నెలల క్రితం తండ్రి కిడ్నీ సమస్యతో మరణించగా తల్లి ఈ 4 రోజుల క్రితం మరణించింది దానితో ఆ కుటుంబం లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలు రోడ్డున పడ్డారు అందులో ఒక అమ్మాయి హ్యాండీక్యాప్డ్ కావడం బాధాకరం ఒకరు ఆరోగ్య సమస్యలతో మానసిక వ్యాధితో బాధపడుతుంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఇలాంటి సమయంలో ఆడపిల్లలకు మానవతా దృక్పథంతో గ్రామపంచాయతీ వార్డు మెంబర్ అయినా గుమ్మడితో అపర్ణ సహకారంతో ఆ కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ ఆళ్ల నాగేశ్వరరావు గ్రామ ప్రజలు గుమ్మడి పాపారావు, రేస్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: