కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ
మన్యం టీవీ మంగపేట.
ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ టిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి కుసుమ జగదీశ్ ఆదేశాల మేరకు
ములుగు మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన జలగం సరస్వతికి ఇరవై వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్కును ములుగు నియోజకవర్గ సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్ ములుగు మండల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్ అందజేశారు. అనంతరం కరోన బాధితులకు మూడు రకాల కూరగాయలు గుడ్లు అంద జేశారు.ఈ సందర్భంగా ఇరువురు కార్యక్రమన్నీ ఉద్దేశించి మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ టిఆర్ఎస్ అని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యకర్తల కుటుంబాలు బాగుండాలని మంచి సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్ కుసుమ జగదీష్ చొరవతో వచ్చిన సీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్కును సరస్వతి కి అందజేశారు.కరోన వైరస్ సెకండ్ వేవ్లో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.
లాక్ డౌన్ కి ప్రతి ఒక్కరు సహకారాన్ని అందించాలి.
కరోన వ్యాధిగ్రస్తులు ధైర్యం కోల్పోకుండా మనో సంకల్పంతో కరోన వ్యాధిని జయించాలని కోరారు.
కరోన వచ్చిన వారికి మనో ధైర్యం కల్పించే బాధ్యత మన అందరి పైన ఉంది అని అన్నారు.ఈయొక్క కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు రాజా మొగిలి,ఆత్మ డైరెక్టర్ గాదె రాజీ రెడ్డి,రైతు బంధు కో ఆడినేటర్ లూస్ రెడ్డి,బానోత్ సోముల్ల నాయక్,బుక్యా జగ్గు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: