👉నలుగురికి ఆదర్శంగా భూపాలపట్నం సర్పంచ్
మన్యం టీవీ,పినపాక:కరోనా మహమ్మారి రోజు రోజుకి పల్లెల్లో విజృంభించడంతో మరణాల రేటు ఎక్కువగా నమోదౌతుంది.పట్నాలను వదిలి పల్లెల వైపు పయనమైన కరోనాను నిర్మూలించడంలో పంచాయతీ సర్పంచ్లు,ఉప సర్పంచులు, కార్యదర్శులు,పంచాయతీ సిబ్బంది సహాయ సహకారాలు మరువలేనివి.కరోనా పంజా విసిరిన వారిపై వారి యొక్క సేవలను అందిస్తున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపాలపట్నం గ్రామపంచాయతీలోని బొగ్గం వెంకటయ్య అనే వ్యక్తీ కరోనాతో చనిపోతే భూపాలపట్నం సర్పంచ్ కొర్సా కృష్ణంరాజు తను దెగ్గరుండీ దహన సంస్కారాలు నిర్వహించారు.పంచాయతీ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్న సర్పంచ్ కొర్సా కృష్ణంరాజు పంచాయతీ ప్రజలు అభినందిస్తున్నారు.
Post A Comment: