CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇంటింటి జ్వర సర్వే కొనసాగుతూనే ఉంది.

Share it:

 



డీడీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరిపే వారిపై

 చర్యలు తీసుకుంటాం.

నిర్ధేశించిన ప్రదేశంలో తవ్వకాలు జరపని ఇసుక ర్యాంపు లను సీజ్ చేస్తాం.


పినపాక మండల పాత్రికేయుల సమావేశంలో

తహసిల్దార్ విక్రమ్ కుమార్


మన్యం మనుగడ, పినపాక: 

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో, పినపాక మండల  ఇంటింటి జ్వర సర్వే కొనసాగుతుందని, సర్వేలో జ్వర సూచనలు కనిపించిన వారికి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం ఆధ్వర్యంలో అన్ని రకాల సలహాలు సూచనలు ఇస్తున్నామని, శనివారం నాడు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల తహసిల్దార్ వెంకట విక్రమ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా  మన ఇసుక -మన విధానం గురించి పాత్రికేయులు వివరణ కోరగా, డి డి లు ఉన్న వారిని మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతి ఇస్తున్నామని, తెలియజేశారు. ఇసుక ర్యాంపు లకు సంబంధించి, తవ్వకాలు జరపాల్సిన ప్రదేశమును వదిలివేసి ర్యాంపు 

నిర్వాహకులు వారికి నచ్చిన ప్రదేశాలలో తవ్వడం సంబంధించిన వివరాలను గురించి, పాత్రికేయులు ప్రశ్నించగా, అటువంటి ర్యాంపుల కు సంబంధించి వివరాలను సేకరిస్తామని, సరైన ప్రదేశంలో తవ్వకాలు జరపని ఇసుక ర్యాంపులను సీజ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. మండలంలోని ఇటుక బట్టి నిర్వాహకులు, లైసెన్సులు లేకుండానే ఇటుక బట్టీలు నిర్వహిస్తూ, ఇటుకల తయారీ కి కావలసిన ఇసుకను, అక్రమంగా ఇటుక బట్టి కేంద్రానికి తరలిస్తున్నారని, ఈ విషయంపై వివరణ కోరగా, అలాంటివాటిని గుర్తిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: