CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పార్టీని అప్రతిష్టపాలు చేయకండి

Share it:

 



కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం


మన్యం మనుగడ, పినపాక:


పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం మాట్లాడుతూ,కొంతమంది కో- కన్వీనర్ అన్ని చెప్పుకొని పినపాక మండలం లో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి వ్యాపారం చేసుకుంటూ , చందాలు వసూలు చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు.దానికి పినపాక మండల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. తమ ఆర్థిక స్వలాభం ప్రయోజనాల కోసం పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు  

వీరు కాంగ్రెస్ పార్టీలో కో కన్వీనర్ పదవి అని చెప్పుకుంటూ మండలంలో ఎవరినీ సంప్రదించకుండా ఒంటెద్దు పోకడ పోతూ, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరువుని దిగజారుస్తున్నారు.కావున వీరిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరపున డి సి సి కి మరియు పిసిసి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కి ఫిర్యాదు చేస్తాం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుడు బోడ రమేష్, నియోజకవర్గ యూత్ నాయకుడు కోర్స్ ఆనంద్, మండల ఉపాధ్యక్షుడు కొంబత్తిని శ్రీను, కోశాధికారి శాఖమూడి సత్యం, జనరల్ సెక్రెటరీ జక్కుల వెంకటేశ్వర్లు, పూనెం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

POLITICS

Post A Comment: