మన్యం టీవీ :జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని మాచినేని పేట తండా గ్రామపంచాయతీలో ఇటీవల కరోనా మహమ్మారి బారినపడిన బాధిత కుటుంబాలను ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ లకావత్ భారతి, మాజీ సర్పంచ్ లకావత్ గిరిబాబు, సోమవారం వారి ఇళ్లకు వెళ్లి వారికి కావలసిన మందులను అందజేసి, వారిలో మనోధైర్యాన్ని నింపి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎవరు అధైర్య పడవద్దని మేమున్నామని భరోసా నింపారు. గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చెల్లిస్తూ హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఎప్పటికప్పుడు పిచికారి చేపిస్తూ కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు. వీరి వెంట ఆరోగ్య.. అంగనవాడి... ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, ఉన్నారు.
Post A Comment: