మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నూతనంగా నిర్మించిన భవనాన్ని వైద్యులు మరియు నర్సుల నివాస స్థావరంగా చేయుట కొరకు పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య , సొసైటీ చైర్మన్ రవి వర్మ , జనం పేట పంచాయతీ సర్పంచ్ మహేష్ ఉపసర్పంచ్ రాయల సత్యనారాయణ సొసైటీ డైరెక్టర్ కామేష్, ఎడ్ల కుమార్ , ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది నాగ మల్లేష్ , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: