మన్యం టీవీ, అశ్వరావుపేట:
మండల పరిధిలోని తిరుమలకుంట గ్రామ పంచాయితీ లో పిఎస్ఆర్ ట్రస్ట్ కరోనతో మరణించిన వారికి దహన సంస్కారాలు చేసి తన మానవత్వాన్ని ప్రదర్శించింది. తిరుమల కుంట గ్రామానికి చెందిన సురేష్ (46) కరోనాతో బాధపడుతూ ఈరోజు తెల్లవారుజామున కొత్తగూడెం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానిక ఉపసర్పంచ్ జుజ్జురి రాంబాబు విషియం పీఎస్ఆర్ ట్రస్ట్ నిర్వహకలైన జక్కుల రాంబాబు కి తెలియజేయగా, వెంటనే స్పందించిన ట్రస్ట్ నిర్వహకులు ట్రస్ట్ సభ్యులు జనమాల శ్రీకాంత్, కేదాసి మంగరాజు, పులగడప రమేష్ లు పీపీఈ కిట్లు ధరించి సచ్చందంగా అంతక్రియలు నిర్వహించారు.
Post A Comment: