మన్యం టీవీ భద్రాచల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం భద్రాచలం పరిధిలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈరోజు జరిగిన కరోనా పరీక్షల్లో సుమారు 91 మందికి చేయగా 48 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిని ఐసోలేషన్ వార్డులో కరోనా బాధితుల కోసం 125 కోట్లు ఏర్పాటు చేయగా 56 మంది కరోనా బాధితులు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఇంకా ఐసోలేషన్ వార్డులో కరోనా బాధితుల కోసం సుమారు అరవై తొమ్మిది బెడ్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజలందరూ మాస్కులు ధరించాలని నిత్యావసరాలు లేదా అవసరమైతే తప్ప బయటికి రాకూడదని అధికారులు సూచించారు.
Post A Comment: