మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ, ప్రజల ప్రాణాలు హరిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రజల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ది:12-05-2021 నుండి పది రోజులు వరకు నాలుగు గంటల మినహాయింపుతో విధించిన లాక్ డౌన్ పరిస్థితుల గురించి అందరికీ విధితమే. లాక్ డౌన్ సమయాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతమైన అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని, బూరుగుగూడెం గ్రామం వద్ద. హైవే రహదారి దగ్గర ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ శిబిరాన్ని, పోలీస్ జిల్లా ఉన్నత అధికారి అయిన డిఎస్పి జి వెంకటేశ్వరబాబు శనివారం నాడు ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా జిల్లా సరిహద్దు ప్రాంతానికి వచ్చిన వాహనాలను ఆపి, ప్రయాణ సమాచారం గురించి వాహనదారుల ద్వారా తెలుసుకొని, మినహాయింపు వర్తించే వాహనాలకు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కారణంగా, విపత్కర పరిస్థితుల్లో విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ పోలీస్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు మరియు సిబ్బంది. రాత్రింబవళ్లు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అని, ప్రజలందరూ అందుకు సహకరించాలని కోరారు.ఈ తనిఖీలో వారి వెంట అన్నపురెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ పి తిరుపతిరావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Post A Comment: