మన్యం టీవీ పాల్వంచ :-
ఈరోజు ఉదయం కొత్తగూడెం రామచంద్ర బాయ్స్ హై స్కూల్ లో సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి, దగ్గరుండి డ్రైవర్, కండక్టర్ కు టీకా వేయించిన * కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఈ రోజు నుండి కొత్తగూడెం నియోజకవర్గంలోని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు మరియు ఇతర సిబ్బంది ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని, వీరందరూ ఆరోగ్యంగా ఉంటేనే ప్రజ రవాణా వ్యవస్థ బాగ ఉంటుందని, సీఎం కేసీఆర్ నిర్ణయాల వల్ల ఈ రోజు ఆర్టీసీ కోలుకుంటోందని, ఈ సందర్భంగా టీకా తెలుసుకోవడానికి వచ్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల ల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వనమా.
ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్దామోదర్, ఆర్టీసీ డిమ్ వెంకటేశ్వర్ల బాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ఎమ్మార్వో రామకృష్ణ, టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, నాగబాబు, కాసుల చరణ్, జమాలుద్దీన్, రమణ ప్రసాద్, వై.న్ రావు, సునీత మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది, అధికారులు, ఆర్టీసీ అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.
Post A Comment: