కిడ్నీ వ్యాధి బాధితునికి 60వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
మన్యం మనుగడ,పినపాక:
పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన గుదే వెంకటేశ్వర్లు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ గడచిన ఐదు సంవత్సరాల నుండి డయాలసిస్ చేయించుకుంటున్నాడు . ముఖ్యమంత్రి సహాయనిధి కింద 60 వేల రూపాయల చెక్కును ఎంపీపీ గుమ్మడి గాంధీ, స్థానిక సర్పంచ్ కోరం రజిని చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ బిసి సెల్ నాయకులు, మండల కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు
Post A Comment: