మన్యం టీవీ, గుండాల:
సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ముత్యమా చారి
గుండాల ఎంపీడీవో గంటా వెంకట్రావు సేవలు మరువలేనివని సర్పంచుల పోరం అధ్యక్షులు కోడేం ముత్యమా చారి అన్నారు. సోమవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఎంపీడీవో వెంకట్రావు కరోనాతో బాధపడుతూ ఆదివారం రాత్రి హైదరాబాదులో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. మండలంలో బాధ్యతలు చేపట్టిన నాటినుండి అభివృద్ధి పనుల్లో వేగం పెంచి పనులు త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టారన్నారు. ముఖ్యంగా అన్ని గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ నర్సరీలు డంపింగ్ యాడ్ లు వైకుంఠ దమూలు మరుగుదొడ్లు పూర్తయ్యే విధంగా చర్యలను తీసుకున్నారన్నారు. భౌతికంగా మన మధ్యన లేకపోవడం ఎంతో బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఇచ్చిన స్ఫూర్తితో ముందు ముందు పంచాయతీ అభివృద్ధి కోసం మా వంతు బాధ్యతను నిర్వహిస్తామన్నారు. సర్పంచుల సర్పంచుల అందరి తరపున వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కోరం కోరం సీతారాములు, కొటేం జయసుధ, ఈ సం సుధాకర్, బచ్చల లక్ష్మీ నర్సు, అజ్మీరా మోహన్, సుతారి సరోజన, ప్రమీల, సౌజన్య , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: