👉డిఆర్వో అశోక్ చక్రవర్తి
మన్యం టీవీ ,కొత్తగూడెం:
సోమవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యలను నేరుగా జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చేందుకు చేపట్టిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఉదయం 10 గంటల నుండి 11 గంటలు వరకు 08744-244888 కు కాల్ చేసి సమస్యను తెలియ చేయాలని డిఆర్వో అశోక్ చక్రవర్తి తెలిపారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం అనంతరం 11 గంటలకు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం, జిల్లా స్థాయి కమిటీల సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని అధికారులు సమగ్ర నివేదికలతో సకాలంలో హాజరు కావాలని ఆయన తెలిపారు.
Post A Comment: