25 కేజీల బియ్యం వితరణ సింగరేణి ఓసి టు కార్మికుడు మహమ్మద్ హుస్సేన్
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని అశోక్ నగర్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయ రాలు జ్యోతిర్మయి కరోనా రోగులను అక్కున చేర్చుకుని ఆపన్నహస్తం అందించి ఆదుకుంటున్నారు.కరోనా బాధితులకు రెండు పూటలా ఆహారం అందజేస్తున్నారు. స్వచ్ఛందంగా చేస్తున్న సేవలను చూసి స్పందించిన సింగరేణి ఓసి టు కార్మికుడు మహమ్మద్ హుస్సేన్ 25 కేజీల బియ్యాన్ని కూనవరం సర్పంచ్ ఏనిక.ప్రసాద్ చేతుల మీదుగా ఉపాధ్యాయురాలు జ్యోతిర్మయి కి అందజేసి తనవంతు సహకారం అందించాడు.ఈ కార్యక్రమాల్లో న్యాయవాది విజయ్ స్వచ్ఛంద సంస్థ సభ్యుడు రఫీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: