CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

హరిప్రియ అమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో కరోనా బాధితులకు ఉచిత భోజనం పంపిణీ

Share it:

 



మన్యం టీవీ: ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గం లోని కరోనాతో ఐసోలేషన్ లో ఉన్న వారందరికీ ఇల్లందు నియోజక వర్గ స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్ హరిప్రియ అమ్మ సేవ సమితి ఆధ్వర్యంలో ఉచిత భోజనం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా కోవిడ్ బారినపడిన ప్రభుత్వ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారికి రెండు పూటల పౌష్టిక ఆహారమైన భోజనాన్ని అందించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. . తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మేరకు కార్పోరేషన్లు, మున్సిపాలిటీలోని పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన అన్నపూర్ణ క్యాంటీన్ స్ఫూర్తితో నియోజకవర్గ పరిధిలోని కరోనా బారిన పడిన చికిత్స నిమిత్తం కేంద్రంగా ఏర్పాటుచేసిన వైటిసి నందు ఉంటున్న కరోనా బాధితులకు భోజనం అందజేయడం జరిగింది అన్నారు. లాక్‌డౌన్‌ వల్ల దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి భోజనాన్ని అందజేసే క్రమంలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇల్లందు నియోజక వర్గం వ్యాప్తంగా నాణ్యత పౌష్టికరమైన ఉచిత భోజనాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. బానోత్ హరిప్రియ నాయక్ ఎమ్మెల్యే గారు వంటలను స్వయంగా వండి పంపడం జరిగింది.ఈ కార్యక్రమంలో హరిప్రియ అమ్మ సేవా సమితి సభ్యులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: