CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

■ సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో రఘురాజుకు చికిత్స

Share it:


■ ఒక జ్యుడీషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలి.చికిత్సను వీడియో తీయాలి.

> సుప్రీంకోర్టు ఆదేశం |


■ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రఘురాజును ఆసుపత్రికి తరలించాలంటూ ఉత్తర్వులను జారీ చేసింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించాలని ఆదేశించారు. ఆర్మీ ఆసుపత్రి ఆయన వైద్య ఖర్చులను భరించాలని చెప్పింది. ఈ చికిత్సా సమయాన్ని జ్యుడీషియల్ కస్టడీగానే భావించాలని తెలిపింది. రఘురాజు చికిత్సను పర్యవేక్షించేందుకు జ్యుడీషియల్ ఆఫీసర్ ను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించాలని ఆదేశించింది. ఆర్మీ ఆసుపత్రి చికిత్స నివేదికను సీల్డ్ కవర్ లో అందించాలని సుప్రీంకోర్టు చెప్పింది. రఘురాజుకు చేసే చికిత్సను వీడియోను తీయాలని తెలిపింది. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను ఏపీ చీఫ్ సెక్రటరీ పాటించాలని చెప్పింది.  దీంతోపాటు ముగ్గురు సభ్యులతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పు కాపీ రాగానే రఘురాజును గుంటూరు నుంచి సికింద్రాబాదుకు తరలించనున్నారు. మరోవైపు రఘురాజు బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

Share it:

Post A Comment: