CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా భాదితులకు బియ్యం, కూరగాయల పంపిణీచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక మండలంలోని పినపాక గ్రామంలో గల ఎస్సీ కాలనీలో కరోనా సోకిన 40 కుటుంబాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆదేశాల మేరకు పినపాక మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం బియ్యం, కూరగాయలు పంచడం జరిగింది. ఈ సందర్భంగా రామనాథం మాట్లాడుతూ, రోజు రోజుకి పెరుగుతున్న కరోనా మహమ్మారి ని అడ్డుకోవాలని,ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, శానిటైజర్ చేతులకు రాసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం చేయాలని,అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటికి వెళ్లాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ కన్వీనర్ చందా సంతోష్ , కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఏలూరి కోటేశ్వరరావు, నియోజకవర్గ యూత్ నాయకుడు కోర్స ఆనంద్ ,మండల ఉపాధ్యక్షుడు కొంబత్తిని శ్రీను, మణుగూరు టౌన్ ప్రెసిడెంట్ నవీన్, తోకల సాంబ, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: