మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వైరా శాసనసభ్యులు రాములు నాయక్, పిలుపుమేరకు TRS పార్టీ యువజన నాయకులు దుద్దుకూరి సుమంత్ గురువారం జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామ పంచాయితీ లో గల కరోనా బాధితుల ఇంటింటికి తిరుగుతూ యువతతో కలిసి కరోనా నియమాలు పాటిస్తూ నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణి చేశారు.కరోనా భాదితులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియచేశారు. అలాగే ఈ విపత్కర సమయంలో యువత భాదితులకు అండగా నిలవలన్నారు.భాదితులకు ఎ ఇబ్బంది వచ్చినా వెంటనే తెలియచేయాలని అన్నారు.నా వంతు సహాయంగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియచేశారు.ఈ సమయంలో దాతలు కూడా ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణోత్ నర్సింహారావు,కార్యదర్శి శ్రీను,కళ్యాణపు నరేష్,కొడెం సితకుమారి ,గాదె కృష్ణయ్య, గ్రామ యువత ఎం ఎం ఆశ అంగన్వాడి కార్యకర్తలు, తదితరులు తెలిపారు.
Post A Comment: