మన్యం మనుగడ, పినపాక:
కరుణా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉండి, ఎక్కువ మొత్తంలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు . అలాంటివారికి నేనున్నాను అంటూ పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన కంది సుబ్బారెడ్డి కరోనా బాధితులకు నిత్యావసరాలను అందిస్తున్నారు.ఏడూళ్ల బయ్యారం పంచాయతీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ, మండలంలోని అన్ని పంచాయతీలకు తన సేవలను చేస్తున్నారు. గురువారం నాడు పినపాక మండలం లోని భూపాలపట్నం, సీతారాంపురం గ్రామాలలో కరోనా బాధితులకు నిత్యావసరాలను అందించారు. ఈ సందర్భంగా కంది సుబ్బారెడ్డి మాట్లాడుతూ మండలంలోని ఏ పంచాయతీ లో నైనా సరే కరోనాతో చనిపోయిన కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందజేస్తానని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భూపాలపట్నం ఎంపీటీసి సోలం కుమారి , సర్పంచ్ కృష్ణంరాజు, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, సీతారాంపురం సర్పంచ్ నాలి మహేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: