మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం గ్రామపంచాయతీ లో గల రైతు వేదిక ఆవరణంలో "గాస్పెల్ ఫర్ ట్రైబల్స్ సోషల్ సర్వీస్ సొసైటీ ఖమ్మం" ఆధ్వర్యంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న మండలంలోని 52 మంది పేద పాస్టర్లకు సుమారు మూడు క్వింటాళ్లు బియ్యం నిత్యవసర వస్తువులు గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్రం మోహన్ రావు, వార్డు సభ్యులు కాజా రమేష్, సంస్థ ప్రతినిధి పుల్లారావు, పాస్టర్లు ఫెలోషిప్, అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, ఏపూరి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: