మన్యంటీవీ, అశ్వారావుపేట:
దాతలు ఇచ్చిన విరాళాలు ప్రతి రూపాయి పేదలకు ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ నారంవారిగూడెం కాలనీకి చెందిన మహిళ కొరోనా తో ట్రీట్మెంట్ తీసుకుంటూ కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పటల్ లో రాత్రి మృతి చెందింది. బాడీని ఇంటికి తీసుకొచ్చేందుకు అంబులెన్స్ వద్దకు వెళ్లి అడిగితే 15 వేలకు తక్కువ వచ్చేది లేదని చెప్పారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే బాధితులు వద్ద ఒక్క పైసా కూడా లేదు ఏం చేయాలో అర్థం కాక బరువెక్కిన గుండెలతో రోదిస్తూ బాడీ ని సైతం హాస్పటల్ లోనే వదిలేస్తామా అనుకునే తరుణంలో పవన్ కళ్యాణ్ సేవా సమితి గుర్తుకు వచ్చి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చెప్పి విలపించసాగారు. డోంట్ వర్రీ మిత్రమా మీకు మేమున్నాం దాతల ద్వారా సేకరించిన విరాళాలు ఉన్నాయి అని, అశ్వారావుపేట నుండి అంబులెన్సులు పంపిస్తున్నాం అధైర్య పడకండి అని ధైర్యం చెప్పి ఈ రోజు తెల్లవారుజామున బాడీని నారం వారి గూడెం తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.
Post A Comment: