మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో సోమవారం తడి పొడి చెత్త బుట్టలను మున్సిపాలిటీ వార్డు లోని ప్రతి ఒక్కరికి పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా. కాంతారావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా మున్సిపాలిటీ ప్రజలకు తడి పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు.ప్రతి ఒక్కరు పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అన్నారు.స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలి అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా టీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి. బ్రహ్మయ్య,మున్సిపాలిటీ కమిషనర్ నాగ ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,ఉప సర్పంచ్ ప్రభుదాస్,సోషల్ మీడియా ఇంచార్జి శ్యామ్ సుందర్, టిఆర్ఎస్ నాయకులు వేముల లక్ష్మయ్య,గణేష్, యువజన నాయకులు, సురేందర్ పటేల్,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: