సిద్దిపేట: ఆడపిల్ల పుడితే భారమని భావించే వాళ్లను చూశాం. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఖానాపూర్లో తన ఇంట్లో మహాలక్ష్మి జన్మించిందంటూ తండ్రి కూతురు పుట్టిన శుభ సందర్భంలో ఊరంతా కూరగాయలు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన మరబోయిన నవీన్కు శనివారం ఆడపిల్ల పుట్టింది. గ్రామంలోని 300 ఇండ్లకు నాలుగైదు రోజులకు సరిపడేలా ఐదు రకాల కూరగాయలు ఆదివారం అందజేసి గ్రామస్తులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు.
కరోనా సమయంలో ఇలా సేవ చేసే అదృష్టం రావడం సంతోషంగా ఉందన్నారు. కూరగాయలు అందించేందుకు గాను నర్సింహరెడ్డి, కొమురెల్లి, శ్రీశైలం, కృష్ణమూర్తి, మల్లేశం, యాదవరెడ్డి, శివాజి యువసేన యూత్ మిత్ర బృందంతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశామన్నారు.
Post A Comment: