మన్యం టీవీ, అశ్వాపురం:
మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ ఛైర్మన్ చేకూరి కాశయ్య మృతి బాధాకరమని ఉమ్మడి ఖమ్మం జిల్లా డీ సీ సీ బీ డైరెక్టర్ తుళ్లూరీ బ్రహ్మయ్య అన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాలో కురువృద్దులు, విషయ పరిజ్ఞానంలో సాటి లేని వ్యక్తి, నడకతోనే నియోజకవర్గంలో ప్రచారం చేసిన నిరాండబరుడు, చిన్నపిల్ల వాడి నుండి ప్రధానమంత్రుల వరకు పరిచయాలు విస్తరించుకున్న స్నేహశీలిడు. రాజకీయ జీవితంలో చారిత్రక ఘట్టం అయిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో గెలిచినా యోధుడు. విద్యార్థులు , గురువులు మెచ్చిన గురుదత్త ఫౌండేషన్ వ్యవస్థాపక ఉపాధ్యాయుడు, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వాసి అయిన మన చేకూరి కాశయ్య గారి మరణ వార్త నన్ను ద్రిగ్బంతికి గురిచేసింది. వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులకు బ్రహ్మయ్య ప్రగాఢ సంతాపం తెలిపారు.
Post A Comment: