మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం రాజుపేట గ్రామం లోని ఎస్సి కాలనీ యూత్ ఆధ్వర్యంలో రాజుపేటలో కరోనా బాదిత కుటుంబాలు కర్రి పుల్లయ్య , కర్రి పెద్దొడు కుటుంబానికి, గంగేర్ల సత్యం తదితర కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు.ఈసందర్బంగా రాజుపేట ఎస్సి కాలనీ యూత్ సభ్యులు మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు అందజేసినందుకు చాలా గర్వాంగా ఉంది. ప్రభుత్వం కూడా కరోనా బాధితులకు గ్రామ పంచాయతీల ద్వారా నిత్యావసర సరుకులు అందజేయాలనీ, ఎస్సి కార్పొరేషన్,ఎస్టీ,బీసీ కార్పొరేషన్ల ద్వారా కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సి కాలనీ యూత్ సభ్యులు కర్రి శ్రీను, నిమ్మగడ్డ ప్రవీణ్, కర్రి కేశవరావు, పల్లికొండ నరసింహారావు,కర్రి వెంకటేశ్వర్లు, కర్రి రామ్మోహన్, కర్రి పవన్,కరకపల్లి సాంబశివరావు , జానపట్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: