మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని రాజుపేట గ్రామ పంచాయతీ లో ఇంటిఇంటికి సర్వే లో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్, ఆశాలు ఇంటిఇంటికి వెళ్లి సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంట్లో ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా,ఉంటే కోవిడ్ టెస్టులు చేయించారా,ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వచ్చిందా వస్తే మందులు వాడుతున్నారా, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలావుంది ఇటువంటి వివరాలు వాటితో పాటు, అనాధ పిల్లల వివరాలు, అనాధపిల్లల వ్యక్తిగత సమాచారం మొదలగు సమాచారాన్ని ఇంటిటికి తిరిగి ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సర్వే లో గ్రామ పంచాయతీ సిబ్బంది కారోబర్ మహేష్, రాజుపేట 6వ, అంగన్వాడీ కేంద్రం అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, అంగన్వాడీ వర్కర్ దుబ్బ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: