CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతుల కల్లాలను పరిశీలించిన మణుగూరు మండల జడ్పీటీసీ, పిఎసిఎస్ అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు

Share it:

 



మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం, అనంతారం గ్రామంలో రైతుల కల్లాలను ఆదివారం మణుగూరు మండల ప్రజా ప్రతినిధులు జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,పిఎసిఎస్ అధ్యక్షులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులు తమ ధాన్యాన్ని సొసైటీ ద్వారా మిల్లర్లకు పంపితే,మిల్లర్లు తరువులు ఎక్కువగా తీస్తున్నారని,రైతులను ఇబ్బందులు పెడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను వారికి వివరించారు.ప్రభుత్వం సన్న ధాన్యం పండించాలని, వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు తెలిపారని ప్రభుత్వ ఆదేశాల మేరకు సన్న ధాన్యం పంపించామని కానీ ఇప్పుడు కొనడానికి ఎవరూ రావడం లేదు అన్నారు.ధాన్యం అంతా కళ్లలోనే నిల్వ ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లు రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని,వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని వారు ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ విషయంపై వెంటనే స్పందించిన జడ్పిటిసి పొశం. నరసింహారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తో మాట్లాడి సమస్యను వివరించారు.వెంటనే స్పందించి అదనపు కలెక్టర్ మిల్లర్ల తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.అనంతరం జడ్పీటీసీ రైతులతో మాట్లాడుతూ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది.సమస్యను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి వెళ్లి ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాము అని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, రైతులు ఉపేందర్,ప్రసాద్, రామారావు,రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: