మన్యం టీవీ ఏటూరు నాగారం:
పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గోవిందరావుపేట మండలం పసర గ్రామంలో సిపిఎం మండల నాయకులు వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిధులుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి వేగుచుక్కలు నిలిచాడని అలాంటి నాయకుని అడుగుజాడల్లో మనమందరం ఉద్యమించాలని పేద ప్రజల కోసం తాను ఎంతో త్యాగం చేసాడని వ్యవసాయ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం జరిపేవాడు అని అలాగే పార్లమెంటులో మొదటి ప్రతిపక్షనేతగా అనేక సూచనలు సలహాలు భారతదేశ ప్రజల గురించి మాట్లాడిన గొప్ప మేధావి పెట్టుబడిదారి సమాజంలో పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పొదిలి చిట్టిబాబు తీగల ఆదిరెడ్డి, సూర్యనారాయణ, నాగరాజు, చల్లరాజు, స్వామి, అశోక్, జ్యోతి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: