మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం రాజుపేట సెంటర్ లో ఉన్న పోలిన హరిబాబు స్థలం ముప్పై అయిదు సెంట్లను ను నెక్కంటి తులసి తన భూమి గా ఆరోపిస్తూ ఈ స్థలం కోర్ట్ వివాదం కోర్ట్ లో ఉందంటూ పత్రిక ప్రకటనలు చేయడం దురదృష్టకరం అంటూ ఈ సందర్బంగా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ధర్మకర్త సీతం రాజు మురళి (బాబీ )పేర్కొన్నారు.ఈ స్థలం మా స్వంతం గత 38 సంవత్సరాలనుండి గ్రామ రెవిన్యూ రికార్డులలో మా పేరునే ఉంది అటువంటి నా స్థలం నా అవసరం నిమిత్తం పోలిన హరిబాబు కు విక్రయించాను అట్టిభూమి పై నెక్కంటి అనిల్ తులసి ఈ స్థలం మాది అంటూ ఆరోపణలు చేయడం సమాజంజసం కాదు. ఈ స్థలం పై నెక్కంటి తులసికి, అనిల్ గాని ఇతరులకు గాని ఎటువంటి సంబంధం లేదు అని ఈ సందర్బంగా సీతం రాజు మురళి (బాబీ )పేర్కొన్నారు.ఇటువంటి తప్పడు ప్రకటనల ద్వారా ప్రజలను మభ్యపెట్టాలని చూడొద్దంటూ, పోలిన హరిబాబు రాజకీయ భవిష్యత్ పాడు చేయొద్దు, నా స్థలం పై మీరు నాది అంటూ ప్రకటనలు చేయడం, కోర్టులకెక్కడం నిరాదారమైన ఆరోపణలు చేయడం హేయకరమన్నారు.నా స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేపట్టిన పోలిన హరిబాబు ని బెదిరించడం బ్లాక్ మెయిల్ చేయడం వంటివి నెక్కంటి అనిల్ కు తగదని ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకొని సహకరించాలని ఈ సందర్బంగా సీతంరాజు మురళి పేర్కొన్నారు.
Post A Comment: