ఒకరికి గాయాలు చికిత్స నిమిత్తం ఖమ్మం తరలింపు
గుండాల మే 16( మన్యం టీవీ)లెవెన్ కె.వి విద్యుత్ లైన్ తగిలి యువకుడు మృతి చెందగా మరొకరికి గాయాలు కావడంతో ఖమ్మం తరలించారు. వివరాల్లోకి వెళితే మండలం పరిధిలోని కాచన పల్లి గ్రామంలో ఒక వివాహానికి డెకరేషన్ వేస్తున్న సమయంలో విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు. కాం కటి విష్ణు 30 అక్కడికక్కడే మృతి చెందగా అధికం సైదులు గాయాలు కావడంతో మెరుగైన చికిత్సకోసం ఖమ్మం తరలించారు. విషయం తెలుసుకున్న ఆళ్ల పల్లి ఎస్ ఐ సంతోష్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇల్లందు తరలించారు. యువకుడు చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి
Post A Comment: