భయాందోళనకు గురవుతున్న ప్రజలు
తహశీల్దార్ కు వినతిపత్రం
మన్యం టీవీ మంగపేట
ఇండ్ల దగ్గర చెరువులో కరోనాతో చనిపోయిన వారిని పూడ్చి పెడుతున్నారని దానితో అక్కడ నివాసం ఉంటున్న నేత కాని దళిత వాడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఇండ్ల దగ్గర కరోనాతో చనిపోయిన వారిని పూడ్చి పెట్టవద్దని కోరుతూ నేత కానీ కులస్తులు గురువారం తహశీల్దార్ బాబ్జి ప్రసాద్ కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత నాలుగు రోజుల క్రితం గ్రామంలో కరోనాతో చనిపోయిన వ్యక్తిని స్మశాన వాటికలో కాకుండా నేత కానీ వాడ దగ్గరలో గల చెరువులో పూడ్చి పెట్టడంతో అక్కడ నివాసం ఉంటున్నవారు తీవ్ర భయాందోళనకు గురవుతు న్నారని అన్నారు.కోవిడ్ తో చనిపోయిన వ్యక్తి ఇండ్ల దగ్గర శవాన్ని పూడ్చడంలో తిమ్మం పేట గ్రామ పంచాయతీ సిబ్బంది ముఖ్య పాత్ర పోషించారని సిబ్బందిపై చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలని ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నేత కానీ సంఘం నాయకులు సతీష్,నర్సింహా రావు,దుర్గం నరసింహరావు,నాగేంద్ర బాబు,జె సాంబశివరావు,బిక్ష పతి,తదితరులు ఉన్నారు.
Post A Comment: