మన్యం టీవీ,దమ్మపేట:ఆధ్వర్యంలో నిరసన ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కర్ రావు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో కారో నా నివారించటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని 15 నెలలుగా దేశంలో రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని ప్రజలపై రకరకాల ఆంక్షలు విధిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని కరోనా తీవ్రంగా లాక్ డౌన్ ఖర్ఫీ ఆంక్షలు పెట్టి వైద్య సదుపాయాలు కల్పించటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని గత పది రోజులుగా రాష్ట్రంలో ఎక్కడ అ టీకాలు వేయలేదని టెస్ట్ లు మండలానికి 30 నుండి 50 నిర్వహిస్తున్నారని ఇదే విధంగా కొనసాగితే ఇంకో వంద సంవత్సరాలు భారతదేశంలో కరోనా నిర్మూలించటం సాధ్యపడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం యుద్ధ ప్రతిపాదిగా అందరికీ టికా వెయ్యాలని ప్రైవేటు హాస్పిటల్స్ డాక్టర్స్ లను ప్రభుత్వ డాక్టర్లను ఐక్యం చేసి ప్రభుత్వమే ఇంటింటికి వెళ్లి కరోనా నివారణ టి కాలు వెయ్యాలని ప్రభుత్వాన్ని కోరినారు కరోనా నిబంధనలు పాటించుకుంటు ఉదయం ఎనిమిది గంటల నుండి 9 వరకుమాస్క్ లు సన్ రైజర్ పది అడుగుల కి ఒకరు చొప్పున నిరసన తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి తంగేళ్లమూడి శివకృష్ణ,దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి పండూరు వీరబాబు,మహిళా సమాఖ్య నాయకురాలు జాంబి నక్క,నాగమణి,ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి బతుల సాయి,ఏ ఐ వై ఎఫ్ నాయకులు తోట శ్రీను,ఈశ్వరి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగేశ్వరరావు,నల్ల లక్ష్మి, ఏఐటీయూసీ నాయకులు మురళి,నల్ల ప్రసాదు తదితర ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: