ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కరోనాను జయించారు. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. సిఎం కెసిఆర్ ఐసోలేషన్ లో వుంటున్న వ్యవసాయ క్షేత్రంలో వ్యక్తిగత వైద్యుడు ఎం వి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు రెండింటిలోనూ నెగిటివ్ గా రిపోర్టులు వచ్చాయి. రక్తపరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా వున్నాయని తేలింది. దాంతో సిఎం కెసిఆర్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు వైద్యులు నిర్ధారించారు.
Navigation
Post A Comment: