CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆడబిడ్డలకు అండ సీఎం కేసీఆర్

Share it:

 


షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన 

• ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.


చండ్రుగొండ ,మన్యం టీవీ ప్రతినిధి:


రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు మంజూరు చేస్తున్న షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను, సోమవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పంపిణీ చేశారు. చండ్రుగొండ మండలానికి చెందిన సుమారు 82 మంది కి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను, దమ్మపేట మండలం తాటి సుబ్బన్న గూడెం లోని ఎమ్మెల్యే నివాసము లో కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ. ఇద్దరికీ చెక్కులను పంపిణీ చేశారు. మిగతా చెక్కులను స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలని. తహశీల్దార్ కు ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కష్టకాలంలో కూడా నిరుపేదలు. మధ్యతరగతి కుటుంబాల వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని. అభివృద్ధి పనులను ఎక్కడ ఆటంకం లేకుండా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని. అందులో భాగంగానే ఈ రోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా పంపిణీ చేస్తున్నారని. చండ్రుగొండ మండలానికి 82 మందికి కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మంజూరయ్యాయని అందులో ఎస్టీలకు 42, ఎస్సీలకు 12, బీసీలకు 19, ఈబీసీలకు 05 మైనార్టీలకు 04, పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ అండ్ మెజిస్ట్రేట్ మరియు సబ్ రిజిస్టర్ ఏం ఉషా శారద, విఆర్ఓ సతీష్ కుమార్, పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: