రూ.24,02,784 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ: మణుగూరు ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ నాయకులు
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు శుక్రవారం మణుగూరు టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పధకం ద్వారా పేద ఇంటి ఆడపిల్లల కు కానుకగా రూ.1,00,116 చెక్కును ప్రభుత్వం అందజేస్తుంది.కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమం అగకూడదు అని,సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరు ఐన కళ్యాణ లక్ష్మీ చెక్కులను మొత్తం 24 మంది లబ్ధిదారులకు రూ 24,02,784 రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు కు అందజేసిన మణుగూరు జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, టిఆర్ఎస్ నాయకులు ఎడ్ల.శ్రీను,వెంకటరెడ్డి,తాత రమణ,వేముల.లక్ష్మయ్య, కోటేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు రామకోటి, బొశెట్టి.రవి ప్రసాద్,గుర్రం సృజన్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: