ఏ మాత్రం అనుమానం ఉన్నా పంచాయతీ సిబ్బంది కి తెలియజేయండి
ఇంటింటికి సర్వే కార్యక్రమంలో పాల్గొన్న పినపాక తహసీల్దార్
మన్యం మనుగడ, పినపాక: కరోనా విషయంలో మండలంలోని ప్రజలు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్యం పట్ల ఎవరికి వారు ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండి, అన్ని రకాల కరోనా నివారణ పనులు చేయాలని మండల ప్రజలకు తహసిల్దార్ వెంకట విక్రమ్ కుమార్ సూచించారు. గురువారం నాడు పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం గ్రామంలో ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొని కరోనా కు సంబంధించిన విషయాలను గురించి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వివరించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలు కనపడినట్లయితే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళుతూ వారి వద్ద నుంచి జ్వర పరీక్షలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: