మన్యంటీవీ,అశ్వారావుపేట: మండలంలోని సూపర్ స్పైడర్స్ గా 190 మందిని గుర్తించడం జరిగింది. వారిలో రేషన్ డీలర్లు, పాత్రికేయులు, గ్యాస్ డీలర్లు, పెట్రోల్ బంకుల్లో పనిచేసే కార్మికులు వున్నారు. ఇలా గుర్తించిన వారిలో 190 మందికి శుక్రవారం రోజు అశ్వారావుపేట లోని ఖమ్మం రోడ్డు లో గల రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రం వద్ద మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి మరియు తహశీల్దార్ చల్లా ప్రసాద్ లు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సర్పంచ్ రమ్య, పేరాయి గూడెం సర్పంచ్ నార్లపాటి సుమతి, రైతు సమన్వయ కమిటీ సభ్యులు చిన్నంసెట్టీ నరసింహం, డీటీ సుచిత్ర, ఆర్ఐ వెంకటేశ్వర్లు, విఆర్ఓ లు, హాస్పిటల్ డాక్టర్స్ హరీష్, అనుదీప్,వెంకటేశ్వర్లు, హాస్పిటల్ సిబ్బంది, మండల యువజన నాయకులు రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: