మన్యం టీవీ పాల్వంచ:-
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్వగృహంలో పాల్వంచ మండలం లోనీ 51 మంది కళ్యాణలక్ష్మీ లబ్ధిదారులు సుమారు 51,6096 లక్షల రూపాయల చెక్కులను తన చేతుల మీదుగా పంపిణీ చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం దేశంలోనే అద్భుతమైన పథకం అని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, పేద ఇంటికి కేసీఆర్ పెద్ద కొడుకు లాంటి వాడని, చెక్కుల పంపిణీ లో అవినీతికి పాల్పడితే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటానని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో జెడ్పీటీసీ బరపాటి వాసుదేవరావు, ఎంపిపి మాడకం సరస్వతి మరియు ఎంపిటిసిలు, సర్పంచ్లు, రెవెన్యూ అధికారులు, కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు.
Post A Comment: