మన్యంటీవీ,అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, దబ్బతోగు గ్రామంలో, చిప్పల భద్రారెడ్డి చెందిన పూరి గుడిసె ఇంటిపై కరెంటు షాట్ సర్క్యూట్ వల్ల నిప్పులు పడి అగ్ని ప్రమాదం జరిగింది. బాధితులు మాట్లాడుతూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు రాగా అప్రమత్తమై బయటకు వచ్చారు. షార్ట్ సర్క్యూట్లో ఇల్లు దగ్ధమైందని, ఈ సంఘటనలో డబ్బులతో పాటు బంగారం, ఫర్నీచర్, దుస్తులు, ఫ్రిజ్, ఇంటిలో ఉన్న విలువ చేసే ఇంటి సామాగ్రితో పాటు, విలువచేసే జీవనాధారమైన వస్తువులు దగ్ధమైపోయాయని. ఈ ప్రమాదం కారణంగా సుమారు సుమారు ఐదు లక్షల మేర ఆస్తినష్టం ఉండవచ్చని అంచనా. అసలే కరోనా కష్టకాలం ఈ తరుణంలో తినడానికి తిండి సయితం సరిగా దొరకని పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వలన ఉండడానికి నీడ కూడా కోల్పోయామని ఆ వృద్ధ దంపతులు బాధని వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.
Navigation
Post A Comment: