మన్యం టీవీ,అశ్వారావుపేట:మండల పరిధిలోని పేరాయి గూడెం గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నార్లపాటి మహేష్ తమ గ్రామ కమిటీ అధ్యక్ష పదవికి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బండి పుల్ల రావుకి సమర్పించారు. ఎనిమిది సంవత్సరాలకు పైగా పేరాయి గూడెం గ్రామ అధ్యక్షుడిగా టిఆర్ఎస్ పార్టీలో విశిష్ట సేవలు అందించిన నార్లపాటి మహేష్ పేరాయిగూడెం గ్రామపంచాయతీలో ఉద్యోగరీత్యా ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండేందుకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన తండ్రి నార్లపాటి లక్ష్మయ్య పేరాయి గూడెం గ్రామపంచాయతీలో ప్లంబర్ గా పని చేస్తూ ఇటీవలే మృతిచెందారని, తన తండ్రి స్థానంలో తాను విధులు నిర్వహించదలిచానని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని, అంతేకానీ పార్టీపై ఎటువంటి వ్యతిరేక భావం లేదని నార్లపాటి మహేష్ తెలిపారు. రాజీనామాను ఆమోదించాలని మండల అధ్యక్షులు బండి పుల్లారావుని కోరారు.
Post A Comment: