మన్యం టీవీ మణుగూరు:
కరోనా కాలంలో పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ బిల్టింగ్ అదర్ కన్స్ట్రక్షన జిల్లా కార్యదర్శి ఉప్పుతల నర్సింహరావు కోరారు. మణుగూరు అంబేద్కర్ సెంటర్ వద్ద ప్లే- కార్డ్ తో నిరసన తెలియజేసారు. అనంతరం ఉప్పుతల నర్సింహరావు మాట్లాడుతూ,ప్రతి భవన నిర్మాణ కార్మికునికీ తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి రూ.10 వేల ఆర్థిక సహయాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు.రోజు కూలీకి వెళ్తే గాని పూటగడవని భవన నిర్మాణ కార్మికులు,వలస కూలీలు లాక్ డౌన్ తో ఒకపూట తిని మరో పూట పస్తులుంటూ నెట్టుకొస్తున్నారని, ఆందోళన వ్యక్తం చేశారు.పనులు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులను,వలస కార్మికులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కరోనా పాజిటివ్ వచ్చిన కార్మికుల కు రూ.50 వేలు వెల్పేర్ బోర్డు నుండి ఇవ్వాలని, కరోనా వ్యాక్సిన్,టెస్టులు అందరికీ ఉచితంగా చేయాలని,రెండు సంవత్సరాలగా పెండింగ్ ఉన్న నష్ట పరిహారాలకు (క్లైమ్స్) నిధులను వెంటనే విడుదల చేయాలని,వలస కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో కొత్తపెల్లి సీతారాములు,వై. వెంకటేశ్వర్లు,కోరకట్ల.లాలయ్య,కుంచాల శివయ్య,టి. చిరంజీవి,బోర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: