మన్యం టీవీ, భద్రాచలం:
నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీ,చర్ల ఏరియా కమిటీకి అనుబంధంగా మిలిషియా కమిటీలో పనిచేస్తున్న నలుగురు మిలిషియా సభ్యులను చర్ల పోలీసులు ఈ రోజు ఉదయం సుమారుగా 6 గంటల సమయంలో కొరకట్పాడు మరియు వీరాపురం గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో చర్ల పోలీసులు మరియు 141 సి ఆర్ పి ఎఫ్ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తుండగా మిలీషియా సభ్యులు పోలీసు వారిని చూసి పారిపోవుచుండగా వారిని వెంబడించి నలుగురు మిలీషియా సభ్యులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని భద్రాచలం ఏఎస్పీ వినీత్.జి ఐపీఎస్ వెల్లడించారు.
పట్టుకున్న వారి వివరాలు
1) మడకం ఉంగయ్య,S/o.భీమయ్య, R/o. రామచంద్రాపురం గ్రామం,చర్ల మండలం,
2) అడమయ్య,S/o ఉంగయ్య,R/o.కిస్టారంపాడు గ్రామం,చర్ల మండలం,
3) రవ్వ మంగయ్య S/o.మాసయ్య, R/o.బక్కచింతలపాడు గ్రామం, చర్ల మండలం,
4) ముసకి ఇంగా,S/o.గంగ , R/o.వీరాపురం గ్రామం,చర్ల మండలం అని తెలిపారు.
వీరు నలుగురు మరియు మరికొంత మంది మిలిషియా సభ్యులతో కలిసి కమాండర్ బాలు@వెట్టి దేవా ఆధ్వర్యంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి మిలిషియా కమిటీగా పని చేస్తున్నారు.
Post A Comment: