మన్యంటీవీ,అశ్వారావుపేట:
మండల పరిధిలోని నారంవారి గూడెం గ్రామ పంచాయతీలో కోవిడ్ సోకి హోమ్ క్వారంటైం లో ఉన్న కుటుంబాలకు చిట్టి తల్లి సేవా సమితి చిట్టితల్లి ఆంబులెన్స్ వారి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు కూరగాయలు, కోడి గుడ్లు, బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చిట్టితల్లి సేవాసమితి వ్యవస్థాపకులు మరియు నారంవారి గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ మనగుండ వెంకట ముత్యం కోవిడ్ బాధిత కుటుంబాలకు మరియు గ్రామ ప్రజలకు కోవిడ్ పై అవగాహన కల్పించి వారికి ధైర్యం చెప్పి, వాళ్లకి ఎటువంటి సమస్య ఉన్న తనని సంప్రదించమని, అన్ని విధాలుగా సహకరిస్తామని భరోసా కల్పించాడు. ఈ కార్యక్రమంలో చిట్టితల్లి సేవా సమితి సభ్యులు బాజీ, చిమడ బోయిన సురేష్, రవి, శేఖర్, సత్తెనపల్లి, వెంకటేశ్వరరావు, ముళ్ళపూడి, చలిపతిరావు, నారం లాలు, పాకనాటి రవికిషోర్, పాకనాటి వెంకటేశ్వరావు, పేరుపోయిన రవి, అల్లం సురేష్, రాకేష్, వనమా గోపి, నారం పోతురాజు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: