CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రామప్ప ను పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు

Share it:

 


 మన్యం టీవీ ములుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప దేవాలయ పరిసర ఆలయాలను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కేంద్ర పురావస్తు శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు కొరకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా రామప్ప ప్రధాన ఆలయంతోపాటు దాని పరిసరాలలో ఉన్న మిగతా ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ అధికారులు తమకు కేటాయించాలని కోరగా సోమవారం కేంద్ర పురావస్తు శాఖ. రెవెన్యూ అధికారులతో కలిసి పరిసర ప్రాంతంలో ఉన్న ఉప ఆలయాలను పరిశీలించి ప్రతి ఆలయానికి దాని చుట్టూ ప్రహరి ఏర్పాటు చేసి 40 అడుగుల రహదారి ఏర్పాటు వచ్చే విధంగా గా ప్రణాళిక రూపొందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పురావస్తు శాఖ సూపరిండెంట్ స్మిత కుమారి, ఉమ్మడి జిల్లా అధికారి మల్లేశం, తాసిల్దార్ మంజుల ఆర్ఐ రాజకుమారి ఎస్సై రమేష్ పాలంపేట సర్పంచ్ డోలే రజిత శ్రీనివాస్, సంబదిత రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: