మన్యం టీవీ ములుగు: ములుగు ఏఎస్పి సాయి చైతన్య ఐపిఎస్ ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ సమీపంలో నివసించే బొడ రామయ్య గుంపుకు చెందిన గిరిజనులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సుమారు 16 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి సుమారు10 కిలోల బియ్యం,5 కిలోల కూరగాయలు,నూనె, పప్పులు మరియు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ సాయి చైతన్య మాట్లాడుతూ గిరిజనులకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి చేయూతనందించడంలో ముందు ఉంటుందని తెలిపారు. అనంతరం వారి కుటుంబాలతో మాట్లాడుతూ గిరిజనుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు సిఐ గుంటి శ్రీధర్, ఎస్ఐ ఓంకార్ యదవ్, ప్రొబేషనరీ ఎస్సై రాధిక మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: