టెస్టు కిట్ల సంఖ్యను పెంచాలి
సరిపడ సిబ్బందిని నియమించాలి
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండల పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్ లో కరోనా టెస్టులు చేపించుకోవాడనికి వచ్చిన వారికి సరిపడా కరోనా టెస్టుల కిట్లు లేక చాల మంది టెస్టులు చేపించుకోక వెను తిరిగి వెళ్లిపోతున్నారని ఆదివాసీ సేన అధ్యక్షుడు పోలేబొయిన ఆదినారాయణ అన్నారు.మంగపేట మండలం లోని మంగపేట చుంచుపల్లి బ్రహ్మాణపల్లి హాస్పిటల్ లో రోజుకు 100 మంది నుండి 150 మంది వరకు కరోనా టెస్టులకు వస్తున్నా హాస్పిటల్ లో కరోనా టెస్టు కిట్లు తక్కువ ఉండడం వల్ల చాలా మందికి టెస్టులు చేపించుకోలేక పోతున్నారని టెస్టుల కోసం వచ్చిన వారు కరోనా టెస్టు కిట్లు అందుబాటులో లేక టెస్టులు చేపించుకోక వెనుదిరిగి వెళ్తునరని టెస్టులకు వచ్చిన వారికి ఎవరికి కరోనా ఉందొ ఎవరికి లేదో తెలియదు టెస్టు చేయక పోవడం వల్ల కరోనా ఉన్నారు కుడా జనాల్లో కలిసి ఉంటే కరోనా వారి నుండి ఇతరులకు సోకి కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతునాయని అన్నారు. ప్రభుత్వం కరోనా టెస్టులకు కిట్లను సరిపడ పంపించి వైద్య సిబ్బందిని పెంచి కరోనా టెస్టులను వేగవంతం చేయాలని ఆదివాసీ సేన అధ్యక్షుడు పోలేబొయిన ఆదినారాయణ అన్నారు.
Post A Comment: