CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులకు అండగా ఉంటాం

Share it:



ధాన్యాన్ని స్థానిక మిల్లర్లకు అమ్ముకునే అవకాశం కల్పించాలి: పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు


మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు వారికి అండగా ఉంటామని,సీడ్ సప్లై అధికారులు లోకల్ మిల్లర్లకు కొనుక్కునే అవకాశం కల్పించాలని ప్రాథమిక వ్యవసాయ శాఖ సహకార సంఘం చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు అన్నారు.మంగళవారం స్థానిక పిఎసిఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మణుగూరు పరిసర ప్రాంతాలలో ధాన్యం అమ్మకాలు ఇతర ప్రాంతం మిల్లర్లకు ట్యాగ్ చేయటం వలన జాప్యం జరుగుతుందని అన్నారు. దీని కారణంగా రైతులు నష్టపోతున్నారన్నారు.ధాన్యం నాణ్యత లేదని పేరుతో ఎక్కువ తరుగుదల తీస్తుండడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.ఈ విషయాన్ని సివిల్ సప్లై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించడం లేదన్నారు. మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా అధికారులు పర్యవేక్షించాలని,లోకల్ మిల్లర్లు అమ్ముకునే అవకాశం కల్పించాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ శాఖ సహకార సంఘం రైతుల పక్షాన పారదర్శకంగా పనిచేస్తుందని,రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.వర్షాలు పడుతుండడంతో కోసిన ధాన్యం నీటి పాలయ్యే అవకాశం ఉందన్నారు. వెంటనే సివిల్ సప్లై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని,లేనిచో రాష్ట్ర ప్రభుత్వ విప్,స్థానిక శాసనసభ్యులు రేగా కాంతారావు చే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు సమస్యను పరిష్కరిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దొండేటి.రామ్మోహన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: